CM Revanth: మోడీ, కెసిఆర్ తోడు దొంగలు : జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి

0
68

CM Revanth :

ప్రజాపాలనలో ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు.త్వరలోనే రూ.2లక్షల రుణమాఫీ చేసుకోబోతున్నామని అన్నారు.

రాంజీ గోండు, కొమురం భీమ్ ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపించారని కొనియాడారు.

ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని, స్థూపాన్ని పర్యాటక కేద్రంగా తీర్చి దిద్దుకుంటున్నామన్నారు.
నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నామని వెల్లడించారు.

ఇంకేమన్నారంటే..

కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది.కడెం ప్రాజెక్టును మరమమ్మతులు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి..తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడతాం.ఆ ప్రాజెక్టుకు మళ్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడతాం.ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం కల్పిస్తాం.ఈ ప్రాంతంలో మూతపడిన సిమెంటు ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం.

మేం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం.
ఇప్పటి వరకు 35కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం..
రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నాం.
పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
ఇన్ని చేస్తుంటే.. కాంగ్రెస్ ను ఓడించాలని అక్కడ మోడీ.. ఇక్కడ కేసీఆర్ అంటున్నారు..

ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అని చెప్పి.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేశారు.పదేళ్లలో ఈ ప్రాంతంలో ఎవరికైనా డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా?

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ను పడగొట్టినా.. ఓడగొట్టినా… ఇందిరమ్మ ఇండ్లు ఆగిపోతాయి.గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పై మోదీ, కేసీఆర్ కక్షగట్టి ఓడించాలని చూస్తున్నారు.

వందరోజుల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు… మరి పదేండ్లు ఉన్న వాళ్లని నడి బజార్లో ఉరి తీయాలా?

పదేళ్లు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు.. కానీ మా ప్రభుత్వం మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసింది.మా ప్రభుత్వాన్ని పడగొడతామంటే నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా? మోదీ, కేసీఆర్ తొడుదొంగలు..డిసెంబర్ లో కేసీఆర్ ను బండకేసి కొట్టారు… రేపు మోడీని కూడా గోడకేసి కొట్టాలి.. బీజేపీని ఓడించాలి.

మోదీ కుంచిత స్వభావంతో నిధులన్నీ గుజరాత్ కు తీసుకెళ్లారు.పదేళ్లు కేసీఆర్ ను చూశారు.. పదేళ్లు మోదీని చూశారు.ఇక మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి..

ఆదిలాబాద్ లో ఆత్రం సుగుణను గెలిపించండి… ఈ ఆడబిడ్డను ఆశీర్వదించండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here