Loksabha: ఓటేసిన సీఎం రేవంత్​, మాజీ సీఎం కేసీఆర్​

0
59

Loksabha:
ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు, నేతలు
ముఖ్యమంత్రి ఏ.రేవంత్​రెడ్డి హైదరాబాద్​ నుంచి కొడంగల్‌‌కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ కుటుంబ సమేతంగా ఆయన వెళ్లి ఓటు వేశారు. జిల్లా పరిషత్‌ స్కూలులోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. ఈ సంరద్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ స్థానంలో తాము గెలవబోతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు, ప్రభుత్వానికి ఈ ఎన్నికలు రెఫరెండం అని తెలిపారు.అనంతరం గ్రామస్తులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పలు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


చింతమడకలో కేసీఆర్​…
సిద్దిపేట జిల్లా చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిక‌ల త‌ర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీల‌దే కీల‌క పాత్ర అవుతుందని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here