KCR:ఈ నెల 22 నుంచి మే 10 వరకు కేసీఆర్​ బస్సు యాత్ర

0
84

KCR:


34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్​ షోలు బహిరంగ సభలు
ఎండల నేపథ్యంలో ఉదయం రోడ్ షోలు, సాయంత్రం బహిరంగ సభలు

ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వ‌ర‌కు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బ‌స్సు యాత్ర చేప‌ట్టనున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బ‌స్సు యాత్రకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు కే వాసుదేవా రెడ్డి శుక్రవారం క‌లిసి బస్సు యాత్ర వివరాలను అందజేశారు. ఈ మేర‌కు బ‌స్సు యాత్ర వివ‌రాల‌ను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అంద‌జేశారు. ఈ నేప‌థ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రకు పోలీసుల స‌హ‌కారం అందించేలా చూడాల‌ని కోరారు. ఎన్నిక‌లు పారదర్శకంగా , ప్రశాంతంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు


ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్‌మ్యాప్‌ను, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని నిన్న జ‌రిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ సూచించారు. ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఉదయం సాయంత్రం రోడ్‌షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here