Konda vishweswar reddy :కాంగ్రెస్​తోనే మాకు పోటీ

0
72

Konda visweshwar reddy :

  • ప్రజలతోనే ఉంటా.. ప్రజల కోసమే కొట్లాడుతా..
  • చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
    లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్​ మధ్యనే పోటీ ఉంటుందని, ఈ పోటీలో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతారు. తాను ప్రజలతోనే ఉంటానని… ప్రజల కోసమే కొట్లాడతానని చేవెళ్ల బీజేపీ లోక్​సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నంతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ చేసిన పనులే తన గెలుపునకు బాటలన్నారు. ప్రస్తుతం మోదీ వే నడుస్తుందని.. నో కరెప్షన్‌.. ఓన్లీ డెవల్‌పమెంట్‌ అని స్పష్టం చేశారన్నారు. బీజేపీ విధానం అంత్యోదయ అని చెప్పారు. కాంగ్రెస్ ది.. చేయి గుర్తుకాదు.. చెంప దెబ్బగుర్తు అని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం అసాధ్యమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ఆరుగ్యారంటీలు అమలు కావన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర నిధులు అన్ని పార్టీల సర్పంచ్‌లకురాజకీయాలకు అతీతంగా ఇచ్చానని తెలిపారు. రూ.11 కోట్ల నిధుల్లో 1,094 పనులకు రూ.7 కోట్ల పై చిలుకు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి కేవలం 49 పనులు మాత్రమే చేపట్టారని విమర్శించారు. తాను బీజేపీ హైవే ప్రస్తావన పార్లమెంట్‌లో మాట్టాడి తేవడం జరిగిందన్నారు. కేంద్ర మంత్రి గడ్కరి శంకుస్థాపన చేసినా, అప్పా జంక్షన్‌ టు మన్నేగూడ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయడం కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు చేతకాలేదని అన్నారు. తాండూర్‌ కంది పప్పుకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో మొదటి సారిగా గళమెత్తినది తానే అన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్ట్‌ అభివృద్ధి కోసం వంద కోట్లు తీసుకు వచ్చినట్లు చెప్పారు. తాండూరులో నాపరాతి పరిశ్రమకు జీఎస్టీ 18 నుంచి 5 శాతం వరకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. తనను మరోసారి చేవెళ్ల ఎంపీగా గెలిపిస్తే.. వికారాబాద్‌ నుంచి తాండూరు వరకు నాలుగులైన్ల రోడ్డు, శంకర్‌పల్లి నుంచి వయా మోమిన్‌పేట రోడ్డు, అప్పా జంక్షన్‌ నుంచి మన్నేగూడ వరకు విస్తరణ పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. శంకర్‌పల్లి నుంచి తాండూరు వరకు ఎంఎంటీఎస్‌ రైలు తీసుకు రావడంలో బీఆర్‌ఎస్‌ చేతులెత్తేసిందన్నారు. హైదరాబాద్‌ నుంచి ముంబయి వరకు బుల్లెట్‌ ట్రైన్‌ కోసం సర్వే మొదలైనదని, వికారాబాద్‌ మొదటి స్టాప్‌ అని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకుంటామన్నారు. బుల్లెట్‌ ట్రైన్‌ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సమాజంలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు బాత్‌రూమ్స్‌ ఉపయోగిస్తున్నారని బయటకు ఎవరూ వెళ్లడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం విజయవంతమైనట్లు చెప్పారు. ముద్రలోన్‌ కిందిస్థాయి వారికి ఇచ్చేలా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని, అలాగే విశ్వకర్మ యోజన పథకం కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, రజకులకు ఇలా కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి చేయూతనందిస్తున్నట్లు చెప్పారు. చేవెళ్లలో త్వరలో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా జీవో 111పై నేతలు వాగ్దానాలు ఇస్తున్నారని తెలిపారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, ప్రతి ఎన్నికల్లో ఇదే చెబుతున్నారని తెలిపారు. జీవో 111 రద్దు చేసి అంతకన్న ఘోరమైన 69 జీవో తీసుకువచ్చారని, ఈ జీవో ఉల్టా పల్టాగా ఉందన్నారు. దీనికి కొత్తగా గౌడ్‌లైన్స్‌ ఏమి లేవని చెప్పారు. ప్రతి గడపను టచ్‌ చేస్తున్నట్లు… లక్షలాది మందితోనే కలుస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రియల్‌ ఎస్టేట్‌ వాళ్లతోని కలుస్తన్నట్లు, ఆయనే తన ఇంట్లో ఉండి లేదని చెప్పిస్తారని ఆరోపించారు.
    కరోనా సమయంలో ఎన్నో సేవలు
    కరోనా కాలంలో తాను ఎన్నో సేవలందిచినట్లు చెప్పారు. శానిటైజర్‌ తయారుపై అవగామన కల్పించడం జరిగిందని, గ్లౌస్‌, మాస్క్‌లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. చేవెళ్లలో 15 బెడ్స్‌తో ఐసోలేషన్‌ సెంటర్‌, డాక్టర్లకు ప్రత్యేక మాస్క్‌లు, మహావీర్‌ ఆసుత్రిలో 20 నాచురల్‌ వెంటిలేటర్‌ తయారు చేసి అందించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా ఇండియన్‌ కోవిడ్‌ వెంటిలేటర్‌ను తాను తయారు చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవలందించడం జరిగిందన్నారు. కరోనా సమయంలో మోదీ కోవిడ్‌ 19 ఇంజక్షన్‌ తీసుకోవాలని ప్రచారం చేయగా.. చికెన్‌ బాగా తింటే కరోనా పోతుందని బీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకున్నారని, ఫౌల్ట్రీ బిజినెస్‌ పెరిగేలా చేసుకున్నారని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here